పుతిన్ ఇండియా టూర్ తర్వాత దారికొచ్చిన ట్రంప్.. మోడీతో చర్చలు?
ఈ చర్చ భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు అంచనా. వ్యాపారం, సాంకేతికతల సహకారంపై మోదీ, ట్రంప్ లోతైన చర్చ చేశారు. భారత్పై అమెరికా విధించిన 50% టారిఫ్ల నేపథ్యంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. టెక్స్టైల్స్, కెమికల్స్, ష్రింప్ వంటి ఎగుమతులపై టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థకు భారం అవుతున్నాయి. మోదీ, ట్రంప్ ఈ అంశాలపై సమాధానాలు కనుగొనేందుకు ఒప్పందం వ్యక్తం చేశారు.
ఇండియా-అమెరికా కాంప్రెహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో పురోగతిని సమీక్షించి, ట్రేడ్ డీల్ కోసం మరింత చర్చలు జరపాలని నిర్ణయించారు. మార్చి నుంచి జరుగుతున్న ట్రేడ్ టాక్స్లో ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. ఈ చర్చలు 2025 చివరికి ఒక ఫ్రేమ్వర్క్ ట్రేడ్ డీల్కు దారి తీసే అవకాశం ఉంది.శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారం పెంచుకోవాలని మోదీ, ట్రంప్ అంగీకరించారు. ఇండియా-అమెరికా కాంపాక్ట్ ఫ్రేమ్వర్క్ కింద మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్, టెక్నాలజీపై దృష్టి పెట్టారు.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు వల్ల అమెరికా టారిఫ్లు విధించిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ముఖ్యమైంది. మోదీ, ట్రంప్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా సహకారం పెంచుకుంటామని హామీ ఇచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు