మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం భోళా
శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. దీని తరువాత ఒకేసారి రెండు సినిమాలని లైన్లో పెట్టాడు
మెగాస్టార్ చిరంజీవి.
కళ్యాణ్ కృష్ణ తోపాటు బింబిసారా ఫేమ్ వశిష్ట తో సైతం సినిమాలో చేస్తున్నాడు
మెగాస్టార్ చిరంజీవి.అయితే వీరిద్దరితో సినిమాలో చేయడానికి
మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్స్ సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా
చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో
సినిమా చేయడానికి రెడీ అయ్యారట. ఈ సినిమాకి నిర్మాతగా సుస్మిత కొణిదలను మెగాస్టార్
పరిచయం చేయబోతున్నారన్న వార్త సైతం వినపడుతోంది. ఇప్పటికే
రామ్ చరణ్ సైరా సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యాడు. సుస్మిత సైతం నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ అండ్
సినిమా సైతం చేసింది. అయితే అవి ఊహించని స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే
మెగాస్టార్ చిరంజీవి తన కూతుర్ని పెద్ద
ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట. మలయాళ హిట్
సినిమా బ్రో
డాడీ సినిమాతో రీమిక్స్ చేస్తున్నాడు చిరంజీవి. కాగా ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నట్లుగా సమాచారం.
ఈ సినిమాను
రీమేక్ చేస్తున్నట్లుగా అఫీషియల్ గా మాత్రం ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దాంతోపాటు ఈ ఏడాది ఆఖరిలో లేదంటే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కాగా ఈ
సినిమా పూర్తి అయిన తర్వాత వశిష్ట దర్శకత్వంలో ఒక పాన్
ఇండియా సినిమా చేయబోతున్నారట చిరంజీవి. అయితే
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఈ కొత్త ప్రాజెక్టులపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇదిలా ఉంటే గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
చిరంజీవి భోళా
శంకర్ సినిమాతో మరింత
సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి..!!