హీరోగా ఎంట్రీ ఇస్తున్న వెంకటేష్ తనయుడు.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. కామెడీ చేయాలన్నా అంతకుమించి ఎమోషన్స్ పండించాలన్న అది వెంకటేష్ వల్లనే సాధ్యమవుతుంది. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని జోనర్స్ లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వెంకీ మామ. అంతేకాదు ఈ జనరేషన్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టింది కూడా ఈయనే. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ 


తర్వాత రానా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా రానా తమ్ముడు అభిరామ్ 'అహింస' సినిమాతో వెండితెరకి హీరోగా పరిచయమైనా ఆ సినిమా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడట. అతను మరెవరో కాదు మన విక్టరీ వెంకటేష్ కొడుకు అర్జున్. వెంకటేష్ కొడుకు అర్జున్ కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. అయితే త్వరలోనే అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయట.


మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వెంకటేష్ కొడుకు అర్జున్ డెబ్యూ మూవీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటికే అర్జున్ కోసం అన్ని వర్గాలకు నచ్చే విధంగా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో సాగే అద్భుతమైన స్టోరీని రెడీ చేశారట. ఆ కథ వెంకటేష్ కి కూడా బాగా నచ్చిందట. దీంతో వచ్చే ఏడాది వెంకటేష్ కొడుకు అర్జున్ డెబ్యూ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవ్వడంతో దగ్గుబాటి ఫాన్స్ అయితే ఈ న్యూస్ విని ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా రీసెంట్ టైమ్స్ లో 'ఎఫ్3' సినిమాతో అలాగే 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించిన వెంకటేష్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: