వైరల్ గా మారిన శ్రీరెడ్డి వ్యాఖ్యలు....!!
శ్రీరెడ్డి సినీ పరిశ్రమకు చెందిన అందరిపై ఎప్పుడూ నోరు పారేసుకుంటూ ఉంటుంది.. ఎప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కానటువంటి రీతిలో వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి పోస్ట్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ శ్రీరెడ్డి ఖాతానుంచే వచ్చిందా లేదంటే ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారా అనేదానిపై స్పష్టత అయితే.దేశవ్యాప్తంగా టీటైమ్ ఔట్లెట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న యువ పారిశ్రామికవేత్త అయిన ఉదయ్ ఈ వారాహి చైతన్యరథం పనులను పర్యవేక్షించారని సమాచారం.. సినిమా కథానాయకులకు ఉండే క్యారీవ్యాన్ లా కాకుండా పూర్తిగా రాజకీయాల కోసం ఉపయోగించేలా ఈ వారాహిని సిద్ధం చేశారని తెలుస్తుంది.ఆరుగురు వ్యక్తులు కూర్చొని చర్చించుకునేలా వాహనం లోపల సిట్టింగ్ రూమ్ అలాగే వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వాహనానికి రెండువైపులా బాడీగార్డులు నిలబడటానికి, జీపీఎస్ ట్రాకింగ్ మరియు వాహనం లోపలి నుంచి పవన్ పైకి వచ్చేలా పవర్ లిఫ్ట్ సిస్టం కూడా సిద్ధమైంది. ప్రజలతో మాట్లాడే సమయంలో చిన్న డయాస్ లా డిజైన్ చేయడంతోపాటు సౌండ్ సిస్టం, లైటింగ్ కూడా అందులో ఉన్నాయి. వారాహి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.