ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వేదాలం' మూవీకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఒరిజినల్ వెర్షన్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెహర్ రమేష్. తాజాగా ఈ సినిమా నుంచి పలు ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే.. ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట.
సినిమాలో హైపర్ ఆది, వెన్నెల కిషోర్, సత్య, గెటల్ శ్రీను, వంటి యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ నటిస్తున్నారు. ఇక సినిమాలో మెగాస్టార్ తన గ్యాంగ్ లో ఉన్న హైపర్ ఆది పై పంచుల వర్షం కురిపిస్తూ ఝలక్ లు ఇవ్వబోతున్నారని సమాచారం. ముఖ్యంగా చిరంజీవి, హైపర్ ఆది మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్విస్తాయట. అంతేకాకుండా వెన్నెల కిషోర్, సత్యలతో చిరంజీవి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే ఓ సాంగ్ ని షూట్ చేశారు..
అందుకు సంబంధించి కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ షూటింగ్లో హైపర్ ఆది, వెన్నెల కిషోర్, రఘుబాబు, వైవాహర్ష, గెటప్ శ్రీను లాంటి కమెడియన్స్ కనిపించారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలో ఈ కమెడియన్స్ తో మెగాస్టార్ చేసే ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. హీరో సుశాంత్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది...!!