ఆగస్టు 9వ తేదీన మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Divya
డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుందని విషయం అభిమానులకు తెలియగానే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ విడుదలైనా సరే తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమాని ఆగస్టు 9వ తేదీన అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇప్పటివరకు ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంగా ఉండబోతున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇదివరకే తెలియజేయడం జరిగింది. మహేష్ బాబుని ఎన్నడూ చూడడానికి విధంగా సరికొత్త గెటప్ లో చూడబోతున్నారని తెలియజేశారు. అయితే ఈ సినిమా విడుదలయ్యేకి దాదాపుగా రెండు సంవత్సరాలు పైనే పడుతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు ,డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల, పూజా హెగ్డే కూడా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో మరొకసారి మాస్ యాంగిల్ లో మహేష్ బాబు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది చిత్ర బృందం. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితోనే సినిమా చేయబోతున్నారు మహేష్ బాబు.. మరి ఈ సినిమా గురించి అప్డేట్ ని చిత్ర బృందం తెలియజేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: