తన తల్లికి ఫోన్ చేసి ఏడ్చిన ప్రభాస్ హీరోయిన్ .....!!

murali krishna
ఆదిపురుష్ సినిమాలో నటించిన కృతి సనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. ఆ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది.హీరోయిన్ కృతి సనన్ తన కెరీర్ ని టాలీవుడ్ లోనే స్టార్ట్ చేసింది. మహేష్ బాబు సరసన ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో నటించింది. అయితే టాలీవుడ్ లో సరైన ఛాన్సులు అందకపోవడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కృతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఒక బాధాకర విషయాన్ని బయటపెట్టింది.

మోడలింగ్‌ పై ఉన్న ఆసక్తితో ఢిల్లీ నుంచి ముంబయి చేరుకున్న కృతి.. అవకాశాలు వేటలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఒకసారి ర్యాంప్‌షో చేస్తున్న సమయంలో ఒక కొరియోగ్రాఫర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అందరి ముందు అవమానించాడట. ఆ అవమానాన్ని తట్టుకోలేక కృతి.. తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాను అంటూ ఏడ్చేసిందట. అయితే ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు చెప్పిన ధైర్యం ఇప్పుడు తనని ఈ స్థాయి వరకు తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చింది.

కాగా ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సీతాదేవిగా కనిపించబోతుంది. ప్రభాస్ రాముడిగా చేస్తుంటే సైఫ్ అలీఖాన్  రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వడమే కాకుండా టికెట్స్ కూడా స్పీడ్ గా అమ్ముడుపోతున్నాయి. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద రామరావణ యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: