ప్రభాస్ బాటలో వెళ్తున్న ఎన్టీఆర్...!!

murali krishna
పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ వరుసగా సినిమాల ను చేస్తున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలను అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాడు.
అలాగే మరో సినిమా సలార్ ను కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తూనే మరో వైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నట్లు సమాచారం.. ఒకే సమయంలో రెండు మూడు సినిమాల షూటింగ్స్ ను సమాంతరంగా తీసుకు వెళ్లడం ఈ మధ్య కాలంలో కేవలం ప్రభాస్ కు మాత్రమే చెల్లిందని చెప్పవచ్చు.
అయితే వచ్చే సంవత్సరం ప్రభాస్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకేసారి రెండు సినిమాలను చేయబోతున్నట్లుగా సమాచారం.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను అయితే చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు  కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల వరకు పూర్తి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో వైపు ఎన్టీఆర్ హిందీ వార్ 2 సినిమాకు కూడా ఓకే చెప్పాడు. అంతే కాకుండా వచ్చే ఏడాది లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడని సమాచారం.

వచ్చే ఏడాది వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాల ను ఒకేసారి చేయాలని కూడా నిర్ణయించుకున్నాడట. 2024 లో ఆ రెండు సినిమాల తో ఎన్టీఆర్ చాలా బిజీ బిజీగా ఉండబోతున్నాడు. ఆ రెండు సినిమాలను కూడా మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు అయితే సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. వచ్చాక దేవర సినిమా షూటింగ్ లో అయితే పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది..
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: