ఆ విషయంలో పవిత్ర లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన నెటిజన్స్..!!

murali krishna
పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ లో సెన్సేషనల్ గా నిలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పవిత్ర లోకేష్ నటుడు నరేష్  తో రిలేషన్ లో ఉండడం తో ఒక్కసారిగా వీరిద్దరూ సంచలనంగా మారారు.ఇక వీరిద్దరూ జంట గా మళ్లీ పెళ్లి  అనే సినిమా చేయడం తో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్ అయ్యారు.
ఇక ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ ఒక్కసారిగా అయితే పాపులర్ అయ్యారు.
ఇకపోతే నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి పక్కన పెడితే తాజాగా పవిత్ర లోకేష్ చేసినటువంటి ఒక పని తెలిసి నేటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తుంది.. పవిత్ర చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఈ విషయం లో ఆమె చాలా గ్రేట్ అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారటా.ఇలా అంత గొప్ప పని పవిత్ర లోకేష్ ఏం చేసింది అనే విషయానికి వస్తే..ఈమె తన మాతృభాష అయినటువంటి కన్నడ సాహిత్యం లో పిహెచ్ డీ  చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఏమి తాజాగా బళ్లారి వెళ్లారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే హంపి కన్నడ యూనివర్సిటీ లో ఈమె పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాసిందని తెలుస్తుంది.. అయితే పవిత్రను స్వయంగా నరేష్ దగ్గరుండి ఈ పరీక్ష రాయడానికి తీసుకువెళ్లి ఆమె చేత ఈ పరీక్ష రాయించారని సమాచారం.పవిత్ర లోకేష్ దక్షిణాది సినీ పరిశ్రమ లో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అన్ని భాషలలో కూడా సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈమె తన మాతృ భాష పై ఎంతో మమకారం ఉందని అందుకే కన్నడ భాషా సాహిత్యం లో పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: