నిహారికకు.. కొత్త జీవితం ఇవ్వబోతున్న సాయిధరమ్ తేజ్?
చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక నిహారిక పెళ్లి జరిగిన నాటి నుంచి కూడా వీరి వైవాహిక జీవితంపై ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. అయితే ఇటీవల చైతన్య, నిహారిక విడాకులు తీసుకుంటున్నారు అంటూ మరో వార్త ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఒకవైపు నిహారిక ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా అవకాశాలు అందుకుంటుంది. నిహారిక నటించిన డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది అని చెప్పాలి.
అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సుప్రీం హీరో నిహారిక మేనబాబా సాయిధరమ్ తేజ్ రాబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫార్మ్ చేశారు. అయితే ఇలా వెబ్ సిరీస్ ద్వారా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న నిహారికకు తనదైన మద్దతు పలికి కొత్త బూస్టప్ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు రావడానికి ఒప్పుకున్నాడట. మరి ఈ వెబ్ సిరీస్ నిహారిక కెరియర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడండి.