గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ మూవీ స్టోరీ లీక్..?

Anilkumar
ఇటీవల లైగర్ సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ, అలాగే జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవల గౌతం తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని కనబరిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

అదేంటంటే గౌతమ్ తిన్ను నూరి, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఈ సినిమా స్టోరీ లీక్ అయిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట. సినిమాలో విజయ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. అయితే సినిమాలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతున్నాయట. మొత్తానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మొదటిసారి విజయ్ దేవరకొండను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి.

నిజానికి ఈ సినిమాని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన చేయలేకపోయారు. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని దర్శకుడు గౌతం చాలా కసితో ఉన్నాడు. ఎందుకంటే ఇటీవల హిందీలో ఆయన తెరకెక్కించిన జెర్సీ సినిమా ప్లాప్ అయింది. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇటు విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం ప్లాపులోనే ఉన్నాడు. ఇతనికి కూడా ఓ హిట్ కావాలి. అందుకే ఈ సినిమా హిట్ ఇటు విజయ్ దేవరకొండ కి అటు దర్శకుడు గౌతం తిననూరికి ఇద్దరికీ చాలా కీలకమనే చెప్పాలి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: