ధనుష్-ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ..!!
గతంలో డైరెక్టర్ మణిరత్నం ఇలాగే ప్లాన్ చేయడం జరిగింది.కానీ అది వర్కౌట్ కాలేదు. ఇదంతా ఇలా ఉండగా కోలీవుడ్ టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెట్రి మారన్. ధనుష్ హీరోగా ఆయన చేసిన సినిమాలు అసురన్ వడ చెన్నై ఇలాంటి సినిమాలు చేశారు. ఎక్కువగా కల్టు కంటెంట్ తో ఈ సినిమాలు చేయడమే బ్రాండ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం తారక్ కి కథ చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.
ధనుష్, తారక్ కాంబినేషన్లు సౌత్ ఇండియాలోనే భారీ మల్టీ స్టార్ సినిమా రాబోతున్నదని అందుకోసం డైరెక్టర్ వెట్రిమారన్ పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లుగా టాకు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రాజెక్టు ఉండబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్ళగానే ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 32వ సినిమా అని డైరెక్టర్ వెట్రీ మారన్ దర్శకత్వంలో ధనుష్ తో కలిసి చేయబోయే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఈ చిత్రానికి తమిళ ప్రొడ్యూసరే నిర్మాతక వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారోచూడాలి.