వాల్తేరు వీరయ్య నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Divya
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. 2023 జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయనతోపాటు కేథరిన్ త్రెసా, సముద్రఖని, బాబి సింహ, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక అప్డేట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో రేపు ఈ సినిమా నుండి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయబోతున్నారు.

ఇప్పటివరకు విడుదల చేసిన సినిమా పోస్టర్లను చూస్తుంటే ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రావడం గమనార్హం.  చిరంజీవి - శృతిహాసన్ మధ్య సినిమాలోని లాస్ట్ పాటను చిత్రీకరించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో వాల్తేరు వీరయ్య పాట కోసం చిరంజీవి -  శృతిహాసన్ మధ్య ఒక పాట షూట్ చేయబోతున్నారట. ఇక ఈ పాట షూటింగ్ అయిపోయిన తర్వాత తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు అని , ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.


ఎలాగో జనవరి 13వ తేదీకి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో త్వరగా ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సినిమా విడుదలకు ఉంచాలని నిర్మాతలు కూడా చాలా వేగంగా పనులు చేస్తున్నారు.  మరి అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.  అయితే ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా పోటి రాబోతుండడంతో రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుందో అనే ఉత్కంఠ కూడా అభిమానులలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: