గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో గీతాంజలి సినిమా రాబోతోంది అని చెప్పవచ్చు.  గుర్తుందా సీతాకాలం కూడా ఇలాంటి తరహా కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  సత్యదేవ్ హీరోగా , తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు.. ఒకపక్క హీరోగా.. మరొక పక్క విలన్ గా .. ఇంకొక పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అదరగొడుతున్నాడు.
ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఇందులో మిల్క్ బ్యూటీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది.. డిసెంబర్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ చేపట్టనున్నారు అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ కూడా ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎవరు హాజరవుతున్నారో సస్పెన్స్ అన్నట్టుగా చిత్ర బృందం ప్రకటించినట్లు సమాచారం.
ఇకపోతే రొమాంటిక్ లవ్ స్టోరీ గా సాగుతున్న ఈ సినిమా మరో గీతాంజలి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అనేది వారికి ఎంతో మధురమైన అనుభవంగా గుర్తుండిపోతుంది.అలాంటి రొమాంటిక్ క్షణాలను గుర్తుకు తెచ్చుకునేలా ఈ సినిమా ట్రైలర్ యువతను బాగా ఆకట్టుకుంది. "లవ్లో ప్రాబ్లం ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లం అయితే"  అనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అంతేకాదు" మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా.." లాంటి సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: