కొత్తగా ఆలోచిస్తున్న బాలయ్య...!!

murali krishna
ఇప్పటివరకు వెండితెరపై హీరోగా మెప్పించి.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు బాలయ్య. యాక్షన్ చిత్రాలతోనే కాకుండా.. తనదైన కామెడీ టైమింగ్‏తో తెలుగు ప్రజలను అలరించారట..
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ వైపు వరుస లతో బిజీగా ఉన్న బాలయ్య.. మరోవైపు ఆహా డిజిటల్ ప్లాట్ ఫాంపై హోస్ట్‏గా రాణిస్తున్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 భారీ విజయాన్ని అందుకుంది. తనదైన కామెడీ పంచులు.. ప్రాసలతో అతిథులతో ఆడియన్స్ కు కావాల్సిన సమాధానాలను సున్నితంగా రాబడుతున్నారు. తనదైన స్టైల్‏తో యాంకరింగ్ కు సరికొత్తదనాన్ని తీసుకువచ్చారు.
ఇక ఇటీవల ప్రారంభమైన సీజన్ 2 కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు, నారా లోకేష్ వచ్చి సందడి చేయగా… రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను ఆటాడుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు ఎప్పుడు వెళ్లని దారిలోకి అడుగుపెడుతున్నారట బాలకృష్ణ. అటు హీరోగా.. ఇటు రాజకీయంగా.. హోస్ట్ గా అన్ని విధాలుగా సత్తా చాటుతున్న బాలయ్య.. కెరీర్‏లో మొదటి సారి కమర్షియల్ యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయి ప్రియ కన్‏స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ ప్రకటనలో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారట.. ఇప్పటివరకు ఎన్నడు యాడ్ చేయని బాలయ్య… ఇప్పుడు తొలిసారి ప్రకటన రంగంలోకి అడుగుపెడుతున్న ఆయనకు శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.
మొత్తానికి బాలయ్య.. అటు హీరోగానే కాకుండా.. ఇటు టాక్ షో హోస్ట్ గా కూడా సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పుడు కమర్షియల్ యాడ్ రంగంలోనూ అడుగుపెట్టనుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గోపిచంద్ మలినేని తర్వాత బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: