గతం లో కుమారి 21ఎఫ్తో ఒక్కసారిగా
ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల
తార హెబ్బా పటేల్. అయితే ఈమె ఫస్ట్ సినిమానే అయినా నటనలో మెచ్యూరిటీ చూపించిన ఈ
బ్యూటీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది
హెబ్బా పటేల్.అంతేకాదు
హెబ్బా పటేల్ అలాగే అందంతో కుర్రకారులను కూడా కట్టిపడేసిందని చెప్పాలి. ఇక దీని అనంతరం పలు వరుస సినిమాల్లో నటించినా హెబ్బాకు ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయింది. అయితే ఇక ప్రస్తుతం ఈ
బ్యూటీ ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’ చిత్రాల్లో నటిస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలతో మళ్లీ ఫామ్లోకి రావాలని భావిస్తోందీ బ్యూటీ.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో
హెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అయితే ప్రేమ,
పెళ్లి విషయాలపై తొలిసారి ఓపెన్ అయ్యింది ఈ భామ. ఇకపోతే ఈ సందర్భంగా
హెబ్బా మాట్లాడుతూ.. ‘గతంలో నేను కూడా డేటింగ్ చేశాను. అంతేకాదు ఆ అబ్బాయి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే ఇక తొలి
సినిమా విడుదలకు ముందే బ్రేక్ అయ్యింది. పోతే ఆ సమయంలో సినిమాలతో బిజీ కావడంతో బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచించలేదు.ఇకపోతే ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చంది.
అయితే ఇక తనకు కాబోయేవాడు ఎలాంటి వాడు అయ్యుండాలనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఊరికే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. కాబట్టి నాకు తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి. అంతేకాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి.ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదు.అంతేకాదు నన్ను ప్రేమగా చూసుకోవాలి’ అని పెద్ద జాబితానే ముందు పెట్టింది అందాల
తార హెబ్బా పటేల్.ఇక తాజాగా
హెబ్బా పటేల్ నటించిన 'గీత' అనే
సినిమా ఆగస్టు 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ
కమెడియన్ సునీల్ సైతం కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పాటు
హెబ్బా పటేల్ తెలుగులో కొన్ని వెబ్ సిరీస్లను కూడా చేస్తున్నట్లుగా సమాచారం...!!