టాలీవుడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి మనకి తెలిసిందే.అయితే ఈమె హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య `రౌడీబాయ్స్` సినిమాలో ముద్దు సీన్లలో నటించింది. అయితే ఒకింత గ్లామర్ రోల్ చేసింది. ఇక ఈమె అందాల విందుతో ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. కాగా దీంతో ఇది పెద్ద హాట్టాపిక్ అయ్యింది. అంతేకాదు నిర్మాత కొడుకైతే ముద్దు పెట్టేస్తావా? అంటూ నెటిజన్లు దారుణంగా ఆడుకున్నారు.ఇదిలా వుండగా ఇక తాజా ఇంటర్వ్యూలో దీనిపై అనుపమా పరమేశ్వరన్ స్పందించింది.
అయితే ముద్దు సీన్లు చేయడం, గ్లామర్ పాత్ర చేయడంపై ఆమె రియాక్ట్ అవుతూ, `రౌడీబాయ్స్`లో గ్లామర్ పాత్ర కావాలని చేయలేదని, కథ డిమాండ్ మేరకు అలా నటించాల్సి వచ్చిందని తెలిపింది అనుపమా. అంతేకాదు ఆయా సందర్భంలో ముద్దు సీన్ డిమాండ్ చేయడంతో నటించినట్టు చెప్పింది. అయితే తనకు ప్రయోగాలు చేయడమంటే ఇష్టమట, తనకు వచ్చేపాత్రలు ఛాలెంజింగ్గా ఉండాలని తెలిపింది.ఇక అలాంటి పాత్రలంటేనే ఇష్టమని చెప్పింది. ఆర్టిస్ట్ గా ఎన్ని భాషల్లో అవకాశాలు వస్తే అన్ని భాషల్లోనూ నటిస్తానని, నటిగా తన స్పాన్ పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది అనుపమా పరమేశ్వరన్.
ఇకపోతే ప్రస్తుతం అనుపమా `కార్తికేయ2`తో ఆడియెన్స్ ముందుకొచ్చింది.కాగా నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో `కార్తికేయ`కి సీక్వెల్గా వచ్చిన సినిమా ఇది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదలైంది. పోతే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మీడియాతో ముచ్చటించింది.పోతే ఇందులో ఆమె మాట్లాడుతూ, దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ తనని చాలా ఎగ్జైట్ చేసిందట.అయితే అందుకే నటించానని తెలిపింది.దీనితో పాటు ఆమె `కార్తికేయ 2`విజయం నాకు డబుల్ ఎనర్జీ ఇచ్చింది. అంతేకాదు సినిమా చూసినవారంతా చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది` అని వెల్లడించింది.అనంతరం నెక్ట్స్ సినిమాలపై అనుపమా మాట్లాడుతూ, ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. ఇదిలావుంటే మరో రెండు కథలు చర్చలు దశలో ఉన్నాయట. అయితే వాటిలో `18పేజెస్` సినిమా వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పింది. ఇకపోతే `కార్తికేయ2`కి సీక్వెల్ ఉంటే, అందులో తన పాత్ర ఎలా ఉంటుందనేది ఇంకా తనకు తెలియదని చెప్పింది...!!