బాలీవుడ్ నాశనమవ్వడానికి కారణం అమీర్: కరణ్ జోహార్

Purushottham Vinay
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే దేశావ్యాప్తంగా క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాలీవుడ్ అంటేనే జనాలు ఛీ కొడుతున్నారు. బాలీవుడ్ మేకర్స్  ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జనాల మెప్పు పొందలేకపోతున్నారు. అందు ఫలితంగా వరుస ప్లాపులు ఎదురుకుంటున్నారు. ఇక బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది సినిమాలే గతేడాది నుంచి దేశవ్యాప్తంగా భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి.ఇంకా దీనికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పగా, తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహార్ మాత్రం అమీర్ ఖానే కారణమని తేల్చి చెప్పారు.కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అమీర్‌ ఖాన్ తో కరణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 'బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఇంకా పుష్ప చిత్రాలు రికార్డు విజయాలు సాధించగా, మన చిత్రాలు మాత్రం సరిగా ఆడలేదు. అలాగే మన వద్ద ఎక్కువగా కనిపించే ఆ టోనాలిటీని ఆయా సినిమాల్లో కనిపించాయి. ఇక దానిని మనం కోల్పోవడానికి కారణం మీరే.


దిల్ చాహతా హై, లగాన్, రంగ్ దే బసంతి ఇంకా అలాగే తారే జమీన్ పర్ వంటి సినిమాలతో నిర్దిష్టమైన ప్రేక్షకులను ఇంకా ఫిల్మ్ మేకర్లను మీరు సృష్టించారు' అని అన్నారు. ఇక దానికి బదులుగా 'మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను తీసిన సినిమాలన్నీ కూడా హృదయాలకు హత్తుకునేవి. ఇక అవి మామూలు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాయి.మన దేశంలో ఎక్కువ మంది ఆసక్తి చూపని సినిమాలు తీస్తే అవి ఎలా సక్సెస్ అవుతాయి. ఈ లోపాన్ని మనలో చాలా మంది కూడా గుర్తించడం లేదు' అని వివరించారు. కాగా, అమీర్ ఖాన్ తాజాగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఈ నెల 11 వ తేదీన విడుదలవుతోంది.ఇక ఇందులో కరీనాకపూర్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమా పై అమిర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమాని అస్సలు చూడమని ఈ సినిమాకి పెట్టే డబ్బులతో తమ ఫ్యామిలీకో లేదా పేద వాళ్ళకోసం ఖర్చు పెడతాం అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: