ది వారియర్: రామ్ కి గట్టి షాకే?

Purushottham Vinay
ఏ దర్శకుడికైనా కూడా ఫార్మ్ అనేది చాలా ముఖ్యం. ట్రెండ్ కి తగ్గట్టు సినిమా తీయకపోతే ఆకట్టుకోవడం చాలా కష్టం. తమిళ దర్శకుడు లింగుస్వామి కెరీర్ బిగినింగ్ లో అసలు ఎన్నో మెరుపులు మెరిపించారు.అయితే ఇక ఈ మధ్య కాలంలో ఆయన నుండి చిత్రాలు రావడమే అరుదైపోయింది. మూడేళ్లకు నాలుగేళ్లకు తీసే ఆ సినిమాలు కూడా అసలు విజయం సాధించడం లేదు. 20 ఏళ్ల కెరీర్ లో లింగుస్వామి పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. ఆయన గత చిత్రం పందెంకోడి 2 సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతుంది. అలాంటి దర్శకుడిని హీరో రామ్ పాపం పూర్తిగా నమ్మాడు. ఆ స్టోరీ ఆయనకు ఏమంత నచ్చిందో తెలియదు కానీ భారీ బడ్జెట్ తో బైలింగ్వల్ మూవీ చేయడానికి రామ్ సిద్దమయ్యాడు.తీరా సినిమా విడుదలయ్యాక తెలిసింది, జరిగిన డామేజ్ ఏమిటో. ఇక రామ్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఓకే చేశావ్ అన్నయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బలం లేని కథ తీసుకొని ఓ ఇరవైఏళ్ళ క్రితం మాస్ చిత్రాల ఫార్ములాలో తెరకెక్కించాడు డైరెక్టర్.అసలు ఏమాత్రం ఆసక్తి రేపని కథనం ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. ఇక ఫస్ట్ షో నుండే ది వారియర్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్ డే పర్వాలేదు అనిపించిన ది వారియర్ రెండో రోజు నుండే దెబ్బకు చతికల పడింది. దానికి తోడు టికెట్స్ ధరలు ఇంకా వరదలు సినిమా వసూళ్లను దెబ్బతీశాయి.గత గురువారం నాడు విడుదలైన ది వారియర్ లాంగ్ వీకెండ్ దక్కించుకొని కూడా రికవరీకి దగ్గర కాలేకపోయింది.



 నాలుగు రోజుల్లో ఏపీ/తెలంగాణాలో కలిపి కేవలం రూ. 15.5 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. ఇక వీకెండ్ ముగిసేనాటికి 48 శాతం మాత్రమే బిజినెస్ చేసింది. ఈ క్రమంలో ది వారియర్ సినిమా రన్ ముగిసే నాటికి పది కోట్లకు పైగా నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా రూ. 13 కోట్లకు ది వారియర్ మూవీని నైజాంలో రూ. 4 కోట్లకు వైజాగ్ లో హీరో రామ్ సొంతగా విడుదల చేశారు.నాలుగు రోజులకు నైజాంలో ది వారియర్ సినిమాకి వచ్చింది దాదాపు రూ. 5 కోట్లు మాత్రమే. ఇక వైజాగ్ లో అయితే రూ. 2 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. నేపథ్యంలో రామ్ ఇంకా స్రవంతి మూవీస్ ది వారియర్ తో భారీగా నష్టాలు చవిచూడనున్నాయి. ఓవర్ సీస్ లో కూడా ది వారియర్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దాదాపు రూ. 2 కోట్ల బిజినెస్ చేసిన ది వారియర్ సినిమా రూ. 80 లక్షలకు దగ్గరైంది. మొత్తంగా రామ్ ది వారియర్ మూవీఫై పెట్టుకున్న అసలు అన్ని గల్లంతు అయ్యాయి. ఈ మూవీలో రామ్ కి జంటగా కృతి శెట్టి నటించగా ఇంకా దేవిశ్రీ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: