ఇటీవల వచ్చిన ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. కాగా
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు
వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఉప్పెన డబుల్
బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇకపోతే 2021లో అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.ఇక ఓ స్టార్
హీరో మూవీ రేంజ్ వసూళ్లు అందుకుంది ఉప్పెన.కాగా ఉప్పెన విజయంతో బుచ్చిబాబు వరుస ఆఫర్స్ తో తీరిక లేని దర్శకుడు అవుతాడని అందరూ భావించారు. అయితే ఇక అలా ఏమీ జరగలేదు.పోతే ఉప్పెన విడుదలై ఏడాది దాటిపోతున్నా బుచ్చిబాబు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
అయితే దీనికి ఓ కారణం ఉంది.ఏంటంటే ఏకంగా
ఎన్టీఆర్ తో
మూవీ చేయాలని బుచ్చిబాబు పట్టుబట్టి కూర్చొన్నాడు. ఇక ఆయనతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా కథ కూడా వినిపించాడు. ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ లో
మూవీ కన్ఫర్మ్ అయ్యింది. దీని టైటిల్ పెద్ది. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా అంటూ కథనాలు వెలువడ్డాయి. పోతే ఒకానొక దశలో అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరిగింది.అయితే కానీ పెద్ది మూవీపై ప్రకటనలేవి రాలేదు. బుచ్చిబాబు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉన్నారని తెలుస్తుంది.ఇదిలావుంటే ఇటీవల బుచ్చిబాబు
ఎన్టీఆర్ ని మరలా కలిశారట. ఇక
ఎన్టీఆర్ కథలో కొన్ని సూచనలు చేశారట.
ముఖ్యంగా
లవ్ ట్రాక్ మరింత బాగా తీర్చిదిద్దాలని, ఓ న్యూ ఏజ్
లవ్ డ్రామాలా ఉండాలని సూచించారట. అయితే
ఎన్టీఆర్ కోరుకున్న విధంగా పెద్ది మూవీలో
లవ్ ట్రాక్ పై బుచ్చిబాబు అండ్ టీం వర్కవుట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇప్పుడు ఈ న్యూస్
టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలస్యమైనా పర్లేదు
ఎన్టీఆర్ తో
మూవీ చేయాలనేది బుచ్చిబాబు పట్టుదలగా ఉందట.ఇక చిన్న హీరోలతో ఎన్ని హిట్స్ కొట్టినా స్టార్
డైరెక్టర్ హోదా రాదు. అయితే అదే ఓ స్టార్ హీరోతో కనీసం హిట్ అనిపించుకున్నా రేంజ్, రెమ్యూనరేషన్ ఎక్కడికో వెళ్లిపోతాయి.ఇక బుచ్చిబాబుతో
మూవీ చేయడానికి టైర్ టు హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ
ఎన్టీఆర్ ని వదలడం లేదు. అయితే ఒక వేళ
ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఒకే అయినా అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది.పోతే కొరటాల,
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ తర్వాతే బుచ్చిబాబు
మూవీ ఉంటుంది. ...!!