మరో ఐటమ్ సాంగ్ కి రెడీ అయిన సమంత.. ఈసారి అంతకుమించి..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె గతేడాది ఆమె నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే  భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది.ఇకపోతే తాజాగా ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టిన సామ్.. ఇక ఇప్పుడు మరో ఐటమ్ సాంగ్ కి సన్నద్ధం అయ్యింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. 

బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను చేస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, ఇక కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. కాగా దాంతో చిత్రబృందం హీరోయిన్‌గా రష్మికను కన్ఫర్మ్‌ చేశారు.ఇదిలావుంటే  ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేయగా.. ఇక ఇందుకోసం సమంతను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే  పుష్పలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఆమె.. 'యానిమల్' కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్.

ఇకపోతే ఈమె  ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. కాగా విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే  ఈ సినిమాకి కూడా 3 కోట్లు తీసుకుంది. కాగా  యానిమల్ విషయానికి వస్తే.. యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.అంతేకాదు అలాగే సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఇకపోతే అనిల్ కపూర్ - రణబీర్ కపూర్ - బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ అంటే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. అయితే మరి ఈ క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: