సాయి తేజ్ కి ఆ హీరోయిన్ ని సెట్ చేసిన త్రివిక్రమ్..?

Anilkumar
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయితేజ్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఇక  ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తానై నడిపిస్తున్నారు త్రివిక్రమ్.ఇకపోతే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా త్రివిక్రమే రాశారు. అయితే ఇక  హారిక-హాసిని క్రియేషన్స్ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమాకి తన పేరు వేయించుకోవడం లేదు.పోతే  దానికి బదులుగా తన సొంత నిర్మాణ సంస్థను ఈ ప్రాజెక్ట్ కి ఎటాచ్ చేశారు.ఇకపోతే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 కాగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ అవకాశం త్రివిక్రమ్ రికమెండేషన్ తో వచ్చినట్లు సమాచారం.అయితే  'భీమ్లానాయక్'సినిమాతో త్రివిక్రమ్ కు, సంయుక్త మీనన్ కు అసోసియేషన్ ఏర్పడింది. ఇదిలా ఉంటె ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా  ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.అయితే తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక  ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్.ఇక  ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఫ్యామిలీ మ్యాన్. పోతే కూతురికి పెళ్లి చేసే వయసు ఉంటుంది.  రీమేక్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ లో పూర్తిగా మార్పులు చేసినట్లు సమాచారం.అయితే సాయితేజ్ ను తీసుకొని, అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసి పెట్టారు. ఇక కథ ప్రకారం.. సినిమాలో హీరోకి యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు.పోతే  అదే సమయంలో దైవ దూతగా పవన్ కళ్యాణ్.. హీరోకి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ఇక ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: