లైగర్ : అప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్?

Purushottham Vinay
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది.ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతున్న లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల గురించి ఒక ప్లాన్ సిద్దం అయ్యిందని తెలుస్తోంది.ఈ లైగర్ సినిమా ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.ఉత్తర భారతంతో పాటు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ అతి త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా హింట్ ఇచ్చాడు. త్వరలో సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ పాటలను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా మేకింగ్ వీడియోస్ ఇంకా అలాగే ట్రైలర్ రిలీజ్ టీజర్ లను రెడీ చేశారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు ఆరు వారాల ముందు నుండే ప్రమోషన్ హడావుడిని మొదలు పెట్టబోతున్నారు. అంటే జూలై నెలలో సినిమా పబ్లిసటీ హడావుడి మొదలు అవుతుందని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ముంబయి లో ఉన్న పూరి జగన్నాధ్ అక్కడ నుండే ప్రమోషన్ కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తాడట.


లైగర్ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల కోసం ఆగస్టు నెల మొదటి వారంలో ఇంకా విడుదల సమయంలో హైదరాబాద్ కు పూరి వస్తాడనే సమాచారం అందుతోంది. ఇక హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఈ నెల చివరి వరకు కూడా తాజా షెడ్యూల్ పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత నుండి లైగర్ సినిమా ప్రమోషన్ లో బిజీ అవ్వబోతున్నాడు.ఈ లైగర్ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇస్మార్ట్ శంకర్ తరహా లోనే ఈ సినిమా కూడా యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ బాగా తెరకెక్కించాడని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు. అలాగే ఆగస్టు నెలలో చాలా సినిమా లు విడుదల కాబోతున్నాయి. కనుక పోటీ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది.. అందుకే సినిమాకి ప్రమోషన్ కూడా కాస్త ఎక్కువే చేయనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: