"రానా - సాయి పల్లవి"కి ఛాలెంజ్... నెగ్గుతారా ?

VAMSI
రేపు థియేటర్ లలో దగ్గుబాటి రానా మరియు సాయి పల్లవి జంటగా నటించిన చిత్ర విరాటపర్వం రిలీజ్ కానుంది. వాస్తవంగా అయితే ఈ సినిమా కొంతకాలం క్రిందటే విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం అయింది. ఇక ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతుండడం తో వాటితో పోటీ పడలేక సరైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చింది. అయితే ఇప్పటికి ఆ సమయం వచ్చింది. కానీ ఈ సినిమాకు ముందు నుండి ఎటువంటి బజ్ లేకపోవడం గమనార్హం. కానీ గత వారం రోజుల నుండి అయితే ప్రమోషన్స్ తో చిత్ర బృందం కొంత మేరకు ప్రజలలో ఈ సినిమా పట్ల అవగాహాన కలిగించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచులను మరి ఎత్తుకు తీసుకు వెళ్ళింది. అంతే కాకుండా ఇది రెండు ప్రేమ హృదయాల యదార్ధ జీవితాన్ని ఆధారంగా చేసుకుని మలిచిన అద్భుతమైన ప్రేమకథని తెలిసిన నాటి నుండి ఇంకా అంచనాలు పెరిగాయి. తెలంగాణకు చెందిన ఒక నక్సలైట్ మరియు అతని మరదలి ప్రేమకథ ఇది. తన భావ కోసం మరదలు ఇంతకు తెగించింది... చివరకు వీరి ప్రేమకథ ఎలా సుఖాంతం అయింది అన్న చిన్న పాయింట్ ను దర్శకుడు వేణు ఊడుగుల ఏ విధంగా ఎలివేట్ చేసాడు అన్నది రేపు థియేటర్ లలో చూడాలి.
బావగా రానా మరియు మరదలిగా సాయి పల్లవి నటించారు. ఇప్పటికే ఇద్దరూ కూడా నటనలో ఎంతమాత్రం అన్నది సినిమా ప్రేక్షకులు చూశారు. అయితే ఈ సినిమా మాత్రం ఇద్దరికీ ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. రేపు ఈ సినిమాతో పటు కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో సత్యదేవ్ హీరోగా చేసిన గాడ్సే మాత్రమే దీనికి పోటీ ఇవ్వగలదు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి రేపు ఎవరు ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ టాక్ సాధిస్తారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: