అక్కినేని వారసులు హీరోయిన్లతో చేసే పని ఇదా..?
అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ మెగా హీరోలనే ఫాలో అవుతున్నారు. మార్కెట్ విస్తరణలోనే కాదు, హీరోయిన్ల మేటర్లోనూ వాళ్లనే ఇన్సిపిరేషన్గా తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది. అన్నయ్య రొమాన్స్ చేసిన హీరోయిన్తో తమ్ముడు.. చిన్నోడు చిందులేసిన బ్యూటీస్తో పెద్దోడు ఆడిపాడుతున్నాడు. ఫ్యామిలీ హీరోయిన్లుగా మార్చేస్తున్నారు.
మెగాహీరోల్లో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ ఒకరు యాక్ట్ చేసిన హీరోయిన్తో మరొకరు రొమాన్స్ చేస్తుంటారు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. చరణ్ 'మగధీర'లో కాజల్ అగర్వాల్తో స్టెప్పులేస్తే ఆ తర్వాత 'ఆర్య2'కి చందమామని తీసుకున్నాడు బన్ని. బావతో 'బద్రినాథ్' చేసిన తమన్నని 'రచ్చ'కి తీసుకున్నాడు బామ్మర్ది. ఇక బన్నితో 'డిజె, అల వైకుంఠపురములో' చేసిన పూజా హెగ్డేతో 'ఆచార్య'లో స్టెప్పులేశాడు చరణ్.
అల్లు అర్జున్, రామ్ చరణ్లాగే నాగచైతన్య, అఖిల్ కూడా ఒకరు యాక్ట్ చేసిన హీరోయిన్తో మరొకరు రొమాన్స్ చేస్తున్నారు. నాగచైతన్యతో 'ఒక లైలా కోసం' చేసిన పూజా హెగ్డేతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చేశాడు అఖిల్. అలాగే చైతన్యతో 'సవ్యసాచి' చేసిన నిధి అగర్వాల్తో 'మిస్టర్ మజ్ను' చేశాడు అఖిల్.
ఇప్పటివరకు అన్నయ్య హీరోయిన్లతో తమ్ముడు సినిమాలు చేసేవాడు. అయితే ఇప్పుడీ రొటీన్లో చిన్న చేంజ్ ఇస్తున్నాడు నాగచైతన్య. 'ఏజెంట్'లో అఖిల్తో డ్యూయెట్స్ పాడిన సాక్షి వైద్యతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు చై. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతన్య తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో సాక్షిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాడట చై.
మొత్తానికి నాగచైతన్య, అఖిల్ హీరోయిన్లను బాగానే మార్చేసుకుంటున్నారు. ఒకరి హీరోయిన్ ను మరొకరు వాడేసుకుంటూ సమన్యాయం చేసేసుకుంటున్నారు. రొమాన్స్ లో ఎక్కడా తేడాలేకుండా జాగ్రత్త పడతున్నారు.