'అంటే సుందరానికీ!' : నిర్మాతలకి ఇంకా జ్ఞానోదయం కాలేదా?

Purushottham Vinay
'అంటే సుందరానికీ!' … న్యాచురల్ నాని నటించిన లేటెస్ట్ మూవీ. జూన్ 10 వ తేదీన విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం టాక్ కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. అలాగే వీకెండ్ ఓపెనింగ్స్ కూడా చూసుకుంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇంకా ఈ సినిమా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు. సోమవారం  నాడు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ చిత్రం ఇంత ఘోరంగా పెర్ఫార్మ్ చేయడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.'అంటే..' రిలీజ్ కావడానికి వారం రోజుల ముందు 'మేజర్' 'విక్రమ్' వంటి చిత్రాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో 'విక్రమ్' చిత్రానికి అయితే రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. ఇక 'మేజర్' చిత్రాన్ని కచ్చితంగా ఒకసారైనా చూడాలని జనాలు బాగా ఫిక్స్ అయ్యారు. పైగా ఆ సినిమాలకి టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ.



అందుకే 'విక్రమ్' ఇంకా 'మేజర్' ఇంకా రాణిస్తున్నాయి. కానీ నాని నటించిన 'అంటే సుందరానికీ!' సినిమా టికెట్ రేట్లు పెంచారు.ఇంకా వరుసగా పెద్ద సినిమాలు చూసిన జనాలు 'అంటే..!' కి ఎక్కువ టికెట్ రేట్లు పెట్టుకుని ఎందుకు వస్తారు? 'అంటే సుందరానికీ!' చిత్రానికి సింగిల్ స్క్రీన్ లలో రూ.175, ఇంకా మల్టీప్లెక్సుల్లో రూ.250 కి పైగా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు కనుక తగ్గించి ఉంటే.. జనాల్లో ఈ చిత్రం చూడాలనే ఆసక్తి కూడా పెరిగేది. అంతే కాకుండా 'మైత్రి' వారి సినిమాలు ఈ మధ్య కాలంలో అయితే 3,4 వారాలకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి.ఇక 'అంటే!' కూడా అదే విధంగా వచ్చేస్తుంది అని ప్రేక్షకులు బాగా ఫిక్స్ అయిపోయారు…! వీటి పై నిర్మాతలు ముందుగా అంచనా వేసి ప్రమోషన్ చేసి ఉంటే కచ్చితంగా ఈ చిత్రానికి కాస్తో కూస్తో మంచి ఓపెనింగ్స్ అనేవి నమోదయ్యి ఉండేవి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: