సన్నీ లియోన్ కి,అడవి శేష్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ కూడా ఒకడు. అందరు వెళ్ళే దారిలో ఈ హీరో వెళ్ళడు. కొత్త దారిలోనే వెళితేనే విజయాలు దక్కుతాయని ఆ ఫార్ములానే మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వరుస విజయాలు అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. క్షణం, గూడచారి, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. వినూత్న రీతిలో సినిమాలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇక ప్రస్తుతం ది రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేజర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అడవి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడవి శేష్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అడవి శేష్ మాట్లాడుతూ..' బాహుబలి లో తాను నటించిన పాత్రకు తల్లి ఎవరో రాజమౌళి కూడా తెలియదని సరదాగా చెప్పుకొచ్చాడు. అనంతరం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను సైతం పంచుకున్నాడు. నిజానికి అడవి శేష్ పేరు ఇది కాదు.తన పేరు 'అడివి సన్నీ చంద్ర'. అయితే తన పేరు మార్చుకోవడానికి సన్నీలియోన్ కారణం అని చెప్పాడు ఈ హీరో.

కాలేజీ చదివే రోజుల్లో సన్నీ లియోన్ బాగా ఫేమస్ కావడంతో తన ఫ్రెండ్స్ అందరూ తనను సన్నీ లియోన్, సన్నీ లియోన్ అని ఏడిపించే వారట. దీంతో వాళ్ళ బాధ పడలేక తన పేరుని అడవి శేష్ గా మార్చుకున్నట్లు తెలిపాడు. సన్నీలియోన్ వల్ల ఏకంగా అడవి శేష్ అని పేరు మార్చుకోవడం ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేకున్నా సన్నీ బ్యాక్గ్రౌండ్ దెబ్బకు శేష్ గా మారి పోవాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్లో పుట్టిన అడవి శేషు అమెరికాలో పెరిగాడు. అక్కడ ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాలలో చిన్న పాత్రలకే పరిమితం కావడాన్ని గమనించాడు. అందువల్ల అక్కడ సినిమాలో నటించడం కష్టమని భావించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: