ఇంద్రజ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవు..!!

Divya
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైనా ప్రముఖ నటి హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా ప్రచారమైన ఎపిసోడ్ లో ఈమె తన కన్నీటి కష్టాలను కూడా చెప్పుకోవడం గమనార్హం. ఇంద్రజ మాట్లాడుతూ 1998 లో ఒక ఫ్లాట్ కొన్నామని ఆ ఫ్లాట్ కోసం చేతిలో ఉన్న డబ్బులు అంతా పెట్టేసాము అని కూడా ఆమె తెలిపింది. కరెక్ట్ గా అదే సమయంలో తన తల్లికి గుండెపోటు రావడంతో వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలని డాక్టర్లు చెప్పినట్లు ఇంద్రజ వెల్లడించారు.

అదే సమయంలో  చేతిలో డబ్బులు లేక ప్రతినెల పని చేస్తే మాత్రమే తాను లోన్ అమౌంట్ పే చేయగలిగే పరిస్థితి కూడా వచ్చింది అని తెలిపింది. అమ్మకు అదే సమయంలో ఆపరేషన్ కూడా చేయాలని వర్క్ చేస్తున్న రెండు కంపెనీలు ఇచ్చిన చెక్కు బౌన్స్ అవడంతో ఎవరిని డబ్బులు అడగాలో తెలియక.. ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతమయ్యాము  అని తెలిపింది. ఆ సమయంలో నగలు అమ్మి అమ్మ కు ఆపరేషన్ చేయించడం జరిగింది అని ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఆరోజు నుంచి డబ్బు అనేది సెకండరీ విషయంగా అయ్యిందని ఎవరికి సహాయం అవసరం వచ్చిన వెంటనే నా చేతిలో ఉంటే డబ్బులు ఇచ్చేస్తాను అని ఆమె తెలిపింది. తన జీవితంలో అత్యంత క్రిటికల్ సమయం కూడా అదే అని తెలిపింది.

ఇక అదే సమయంలో అమ్మను కాపాడుకుంటానో లేదో అని కూడా భయం వేసింది. కానీ ఆపరేషన్ తర్వాత 15 సంవత్సరాల పాటు జీవించారు అని ఇంద్రజ తెలిపింది. మదర్స్ డే సందర్భంగా ఆమె తన అమ్మ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది . అంతే కాదు ఆమె మాటలు విన్న నెటిజన్స్ సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: