నితిన్ హీరోగా బన్నీ డైరెక్టర్ సెకండ్ మూవీ లాంచ్!

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ మిడ్ రేంజ్ హీరో యూత్ స్టార్ నితిన్ తదుపరి చిత్రం `మాచర్ల నియోజక వర్గం`లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరో నితిన్ మరో సినిమాకి సైన్ చేశాడు.టాలీవుడ్ రైటర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలకు కథలు అందించిన అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ అవ్వడం జరిగింది.ఇక ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సినిమా ముహూర్తం షాట్ కు పుస్కర్ రామ్ మోహన్ రావు క్లాప్ కొట్టగా..అలాగే ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా కెమెరా స్విచాన్ చేశారు.



డైరెక్టర్ సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఇంకా అలాగే ఠాగూర్ మధు స్క్రిప్ట్ ను అందజేశారు.ఇక పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి తన అందంతో తెలుగు యూత్ ని పిచ్చెక్కిస్తున్న కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఇక అల్లు అర్జున్ తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వక్కంతం వంశీ ఈ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి దమ్మున్న రచయితగా నిరూపించిన అతడు ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: