కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా అలాగే మహేష్ మైనర్ ఆపరేషన్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన సర్కారు వారి పాట మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. మైత్రీ మూవీమేకర్స్ ఇంకా 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ముందు అనుకున్న బడ్జెట్ కంటే తాజాగా ఈమూవీకి బడ్జెట్ పెరిగిందని సమాచారం తెలుస్తుంది. పెరిగిన బడ్జెట్ ని బట్టి హీరో సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఈ సినిమా మారినట్టుగా తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేయడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారట. పెరిగిన బడ్జెట్ కు అనుగణంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ప్రస్తుతం నిర్మాతలు హ్యాపీగా వున్నారట. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ రషెస్ చూసుకున్న మేకర్స్ సినిమా సాధించబోయే విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ తో వున్నట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం కీలక ఘట్టాలని స్పెయిన్ గోవాలో షూట్ చేయడమే అని తెలిసింది. అయితే ఆ కారణంగా బడ్జెట్ పెరిగినా సూపర్ స్టార్ మహేష్ హీరో కాబట్టి సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్స్ చాలా కూల్ గా వున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక ఇప్పటికే మహేష్ బర్త్ డే బ్లాస్ట్ పేరుతో విడుదల చేసిన వీడియో, లిరికల్ సాంగ్ వీడియోలు ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. యస్ యస్ తమన్ అందించిన సంగీతం నెట్టింట వైరల్ అవుతూ హల్ చల్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే 'పోకిరి' సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయని మహేష్ స్వయంగా హింట్ ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఇక మరోసారి సమరమే.. అంటూ ఈ సినిమా రిలీజ్ కోసం రెడీ అయిపోతున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసి చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.