"రాధేశ్యామ్": ప్రేమకథలను కమర్షియల్ గా చూడకండి... ?

VAMSI
ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఏంతో ఆత్రుతగా ఎదుుచూస్తున్న మన యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మగా అందరి మనసు గెలిచిన మన ముద్దుగుమ్మ పూజా హెగ్డే కలిసి జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". ఈ సినీమా ఇటీవలే రీలీజ్ అయ్యి అందరూ అనుకున్నట్లు గానే ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు కూతురు ప్రసీద, అలాగే యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మించబడింది. అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాలలోనూ విశేషమైన స్థానాన్ని పొందిన చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంతగా ప్రజల ఆదరణను పొందిన సంధర్భంగా "రాధే శ్యామ్ " సినిమా గురించి సీనియర్‌ నటుడు అలాగే హీరో ప్రభాస్ పెద్దనాన్న అయినటువంటి కృష్ణంరాజు తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కృష్ణం రాజు చెప్పిన ప్రకారం ఈ సినిమాను మరే ఇతర కమర్షియల్ సినిమాల్తో పోల్చుకుని చూడడం తగదని తెలిపారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ సినిమా కథ ఒక ప్రేమకథ. ఇంతకు ముందు ప్రభాస్ నుండి వచ్చిన బాహుబలి సిరీస్ కావొచ్చు, అలాగే గత సంవత్సరం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్ అయిన "సాహో" కావొచ్చు. వీటికంటే భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా "రాధే శ్యామ్". ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. అయితే రిలీజ్ రోజు నుండి నేటికి సినిమా చూసిన వారిలో ఎక్కువగా యువతే ఉందన్నది కాదనలేని వాస్తవం.

మరి ఇప్పటి వరకు సినిమా వర్గాల నుండి కావొచ్చు, లేదా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు వస్తున్న నెగటివ్ స్పందనకు ఎవరూ కారణం కాదు. మళ్ళీ మెల్ల మెల్లగా కలెక్షన్ లలో వేగం వస్తుందని సినిమా బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక వినూత్నమైన, ప్రేమకథను అందించారు అని ఒక వర్గం ప్రేక్షకులు అనుభూతి చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: