హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరం లేదు.. హీరో నటుడు గా దాదాపు కొన్ని సంవత్సరాల క్రిందటే ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య తో జోష్ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్లు నటించాడు. ఇప్పుడు తాజాగా డీజే టిల్లు వంటి సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ఇలాంటి సినిమా తాజాగా ఓటిటి లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఇక అసలు విషయంలోకి వెళితే డీజే టిల్లు తెలుగు మూవీ ని ఓటిటి హక్కులను ఆహా సంస్థ దక్కించుకున్నది. ఇందుకు సంబంధించి ఆహా సంస్థ ఒక ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది.. త్వరలో ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోందని తెలియజేయడం జరిగింది. ఇక ఈ చిత్రం వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా ఒక పోస్టుర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ చిత్రం బుల్లితెరపై ఎలా అలరిస్తుందో చూడాల్సిందే. ఇక కేవలం ఈ సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తి అయిన వెంటనే ఆహాలో విడుదలవుతోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను మాత్రం స్టార్ మా దక్కించుకుంది.
ఈ సినిమా ఎక్కువగా యువతని బాగా ఆకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బిజినెస్ పరంగా కూడా భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం నైజాంలో 2.80 కోట్లు.. ఆంధ్ర 3.40 కోట్లు మొత్తం మీద 7.70 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ఇక దీంతో సిద్దు, నేహా శెట్టి కి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.