మహేష్ కు పిన్నిగా సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

praveen
మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్న మహేష్ బాబు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గీతగోవిందం ఫేమ్ పరశురాం ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక మరి కొన్ని సినిమాలను మహేష్ బాబు లైన్లో పెట్టేశారు. ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు మహేష్ బాబు ఓకే చెప్పేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా ప్రారంభానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు బాగా కలిసొచ్చిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి.

 ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ బాబు మామ పాత్రలో విలక్షణ నటుడు మోహన్బాబు నటించబోతున్నారు అంటూ టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు పిన్ని పాత్రలో ఒక సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ శోభన త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కె  సినిమాలో మహేష్ పిన్ని పాత్రలో నటించబోతోందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: