నటి హేమ ఎన్నో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది.ప్రతి పాత్రలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిన హేమ ఎంతో మంది ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని పొందింది.అయితే హేమ ఇటీవల తన ఇంటర్వ్యూలలో తన కెరీర్లో పడ్డ కష్టాలను గురించి చెబుతూ అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది.
ఎన్నో సినిమాల్లో భాగమై తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హేమ. రాజోలు నుంచి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకొనిb ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిందట హేమ. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చిందట..
సాధారణంగా ఇండస్ట్రీ అంటే జనాలకి చాలా లోకువ అని చెప్పిన హేమ.. కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన తల్లి సపోర్ట్తో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పిందట.. ఇప్పుడంటే కారవాన్స్ వచ్చి అన్ని వసతులు ఉన్నాయి గానీ.. అప్పట్లో షూటింగ్ లొకేషన్స్లో బట్టలు మార్చుకోవాలంటే సరైన ప్లేస్ కూడా ఉండేది కాదని, కనీసం టాయిలెట్స్ కూడా అస్సలు ఉండేవి కాదని చెప్పుకొచ్చింది. తన తరం కంటే తన ముందు తరం ఇంకా ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు బాగా పడిందని తెలిపిందట హేమ.
ముత్యాల సుబ్బయ్య గారి భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనను ఓ ప్రొడక్షన్ బాయ్ అవమానించాడని చెప్పిందట హేమ.. ఆ రోజు జరిగిన సంఘటనను ఆమె వివరించింది. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ గారు మరియు యూనిట్ అందరితో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్కి చెందిన ఓ బాయ్ వచ్చి ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అనేశాడట., ఆ సమయంలో చిర్రెత్తే కోపం వచ్చి వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయానని ఆమె చెప్పింది.
దాంతో అదే రోజు తింటే వేళ్లతోనే తినాలని డిసైడ్ అయి మరింత కసిగా వర్క్ చేశానని చెప్పిందట హేమ.. అదే ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ కూడా ఉన్నాడని, తాను నరసింహ నాయుడు సినిమా చేస్తున్నపుడు తనను చాలా కేరింగ్గా చూస్తూ మంచి భోజనం ఆయన అందించాడని చెప్పింది. కాకపోతే కెరీర్లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం తన మనసులో అలాగే ఉండిపోయిందని హేమ చెప్పుకొచ్చింది..