ఎన్టీఆర్ లైనప్ లో మార్పులు.. అతనే కారణం!!
ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్న కొరటాల శివ ఈ చిత్రానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి తన తదుపరి సినిమాకు వెళ్లిపోవాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ప్రశాంత్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే విధంగా పరిస్థితి కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇటీవల ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కథకు బాగా ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ సినిమా ఈ గ్యాప్ లో చేయాలని భావిస్తున్నారు. చిన్న దర్శకుడితో సినిమా అంటే తొందరగా అయిపోతుంది ఉద్దేశంతోనే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడట. అటు తిరిగి ఇటు తిరిగి ప్రశాంత్ నిర్ణయం బుచ్చి బాబు కు కలిసి వచ్చింది. తొందరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఈ లైనప్ లో మరిన్ని మార్పులు ఉంటాయి లేదా చెప్పిన విధం గా సినిమాలు జరుగుతాయా అనేది చూడాలి.