ఆ సినిమాలో ఐదుగురితో రవితేజ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు, ఆ ఫామ్ ను  అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో రవితేజ కూడా వరుస  సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా రవితేజ హీరోగా నటిస్తున్నాడు, ఇలా ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్న రవితేజ తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మాతగా రావణాసుర సినిమాలో రవితేజ నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ ఈ రోజే పూర్తి అయ్యింది. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను బయటకు వదిలింది, ఈ పోస్టర్ లో రవితేజ కోటు వేసుకుని నోటిలో సిగరెట్ పెట్టుకొని చేతిలో లైటర్ పట్టుకొని ఉన్నాడు, ఈ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశాడు, ఇది ఇలా ఉంటే మూవీ కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఐదుగురు క్రేజీ హీరోయిన్ లు నటిస్తున్నారు, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష, అను ఇమ్మాన్యుయేల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఐదుగురు హీరోయిన్ లలో నలుగురుది సాఫ్ట్ క్యారెక్టర్ లు కాగా, దక్ష నాగర్కర్ మాత్రం విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో దక్ష నాగర్కర్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. భోగి రోజు లాంఛనంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ఈ సినిమాని గ్రాండ్ గా ప్రారంభించారు, ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమాను 30 సెప్టెంబర్ 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాలతో పాటు రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో నటించబోతున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా నటించడానికి రవితేజ రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: