నాని : మరచిపోయా .. క్షమించండి .. రియాక్ట్ అయిన అల్లు అర్జున్
మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు హీరోలు తమ పంథాను మార్చుకుంటూ ఉన్నారు. ఒకరి సినిమాను మరొకరు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలోనో, బహిరంగ వేదికపైనో అభినందనలు తెలియజేస్తున్నారు. అదేకోవలో అల్లుఅర్జున్ కూడా నాని సినిమాకు అభినందనలు తెలియజేసారు. ఇటీవల శ్యామ్సింగరాయ్ ప్రత్యేకంగా చూసి హీరో రామ్ చరణ్ కూడా అభినందించారు. తాజాగా అల్లుఅర్జున్ కూడా అభినందనలు తెలిపారు. కానీ అంతకంటే ముందు క్షమాపణలు చెప్పారు బన్నీ.
అదేవిధంగా తెలుగు సినిమా గెలవాల్సిన సమయమిది. ఒక్క సినిమానే కాదు.. అన్నీ తెలుగు సినిమాలు సక్సెస్కావాలి. కరోనా తరువాత తెలుగు సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. అఖండ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత పుష్ప, శ్యామ్సింగరాయ్ సినిమాలు కూడా భారీ విజయాన్నే సాధించాయి. శ్యామ్ సింగరాయ్ టీమ్ను కంగ్రాట్స్ చేసే అవకాశం ఎక్కడా దొరకలేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను అని వివరించారు. నాని పెర్పామెన్స్ చాలా బాగుంది. అదేవిధంగా సాయిపల్లవి కూడా అద్భుతంగా నటించింది. ఎవరైనా సినిమా చూడడం మిస్ అయితే ఓటీటీలో తప్పకుండా చూడండి అని గ్రేట్ అటెంప్ట్ అన్నారు అల్లుఅర్జున్.
ఇక డిసెంబర్లో విడుదలైన తెలుగు సినిమాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. అది ఇది అని కాదు.. సినిమా గెలవాల్సిన సమయం ఇది అని అన్నారు బన్ని. రౌడీబాయ్స్ డేట్నైట్ పాటను విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ఆర్యలేకపోతే నేను లేను. నా జీవితంలో దిల్ రాజు ఓ ముఖ్యమైన భాగం. దిల్ రాజు లేకపోతే ఆర్య లేదు. ఆ సినిమా సమయంలోనే ఆశిష్ను చూశాను. ఆశిష్ హీరోగా ఎదగడం ఆనందంగా ఉంది. సంక్రాంతి పండగకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు అల్లుఅర్జున్.