చేప పిల్లలా నీటిలో తేలియాడుతున్న హీరోయిన్..!

Divya
2021 సంవత్సరం ముగిసిపోయి..2022 లోకి అడుగు పెట్టేశాం. ఈసారి మాత్రం సెలబ్రేషన్స్ చాలా పీక్స్ కి వెళ్ళాయి అని చెప్పవచ్చు. మన స్టార్స్ మాత్రం కొంతమంది సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు,బీచ్ లకు సైతం వెళ్లి ఫెస్టివల్ ను చేసుకున్నారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హీరోయిన్ దిశా పటాని కూడా.. మాల్దీవుల్లో జరుపుకున్నదట. ఈమెతో పాటు టైగర్ ష్రాప్ కూడా వెళ్లారు. వీరిద్దరూ న్యూ ఇయర్ కి రెండు రోజుల ముందే మాల్దీవుల్లో చేరుకున్నారు. తాజాగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది దిశాపటాని. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.


మాల్దీవుల్లో తన అందమైన శరీరంతో నీటిలో పడుకొని సముద్రపు ఒడ్డున అస్తమిస్తున్న సూర్యుడు సమయంలో బికినీ వేసుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఇక ఇదివరకు కూడా వీరిద్దరూ కలిసి కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేయడం కూడా జరిగింది. హీరోయిన్ దిశా పటాని కూడా.. ఎక్కువగా బీచ్ ప్రదేశాలను ఇష్టపడుతుందట. అందుచేతనే ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా మాల్దీవులకు వెళ్ళిపోతుంది. ఇక టైగర్ ష్రాప్ తో దిశా పటాని ప్రేమలో ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ వార్తల్ని వీరిరువురు ఖండించడం జరిగింది. కేవలం మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలియజేశారు.

అయితే ప్రస్తుతం దిశాపటాని బీచ్ లో జలకాలాడుతున్నటువంటి ఒక ఫోటో బాగా పాపులర్ గా మారింది. నీళ్లల్లో జారిపడిన ఒక చేప పిల్లల ఎంతో ముద్దుగా ఉంది దిశాపటాని. ఈమె సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.. దీంతో ఈమె అడుగు బాలీవుడ్ వైపు వేసింది. అక్కడ నటిగా బాగానే రాణి ఇస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: