పబ్లిక్ టాక్: నాని దెబ్బకు "ఆర్ ఆర్ ఆర్" కలెక్షన్ లు తగ్గేనా?

VAMSI
న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అంతకంటే గ్రాండ్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని జోరు చూపిస్తోంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్టడీగా కలెక్షన్లు వసూళ్లు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే అటు ఇటుగా ఇంకో పది రోజుల్లో ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 7 న రిలీజ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
అయితే భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టాలి అంటే ప్రేక్షకులంతా ఈ సినిమా వైపు ఫుల్ గా అట్రాక్ట్ అవ్వాలి. అందుకోసం జక్కన్న అండ్ టీమ్ ఏమి చెయ్యాలో అంతా చేస్తున్నారు. మొన్ననే తమిళనాడు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపిన విషయం తెలిసిందే. అక్కడ మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ లోనూ మొన్న కపిల్ శర్మ షోలోనూ ప్రమోషన్స్ చేసుకున్నారు. ఇలా దేశమంతా 'ఆర్ ఆర్ ఆర్' ఫీవర్ ను పెంచుతున్నారు.
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే... అభిమానులు పోటీ పడి మరీ సినిమా చూస్తారు...దీనికి వచ్చే కలెక్షన్ లు రాక మానవు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయి ఉన్న రెండు సినిమాలు పుష్ప మరియు శ్యామ్ సింగ రాయ్ లు కలెక్షన్ లను షేర్ చేసుకుంటున్నాయి. ఎక్కువ భాగం నాని సినిమానే తీసుకుంటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న "శ్యామ్ సింగరాయ్" వలన "ఆర్ ఆర్ ఆర్" కు కలెక్షన్ లు తగ్గుతాయి అన్ని అనుకుంటున్నారు. అయితే ఏమి జరుగుతుంది అనేది ఇంకో వారం పది రోజులు ఆగితే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: