సినిమా టికెట్ల వివాదం ఇంకెంత దూరం వెళుతుందో?
ఈ అంశంపై ప్రముఖ టాలివుడ్ నిర్మాత దిల్ రాజు సైతం మాట్లాడుతూ ఈ విషయం గురించి ప్రభుత్వంతో చర్చిస్తాము. మాపై ఒత్తిడి పెంచినా ముందుకే వెళతాం, వెనక్కి తగ్గం. సినిమాలు అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ దిల్ రాజు అన్న మాటలు వివాదానికి తావిస్తున్నట్లు ఉంది. ప్రభుత్వం నుండి రిపోర్ట్ వచ్చే వరకు ఎవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ఇండస్ట్రీ నుండి వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ విషయాన్ని చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని సమస్యను పరిష్కరించడానికి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ కమిటీకి చైర్మన్ గా హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ. కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్, MA & UD డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, I&PR వంటి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ కమిటీ సినీ పెద్దలలో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న టికెట్ల పంచాయితీ ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుంది. ఇక ఎప్పుడైనా ఈ సమస్య సర్దుమణుగుతుందేమో చూడాలి.