సర్కారు వారి పాట కోసం మహేష్ కీలక నిర్ణయం!!

P.Nishanth Kumar
మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మోస్ట్ డిజైరబుల్ మెన్ గా ప్రతి ఏడాది ఆ జాబితాలో పేరు సంపాదించుకుంటున్న మహేష్ బాబు కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని ఇక్కడే తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట సినిమాను ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా వైడ్ గా తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 2022 లో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించింది. కానీ వరుసగా చిత్రాలు విడుదల కాబోతున్నడంతో సోలో గా రావాలని చెప్పి పండుగ సీజన్ నుంచి తప్పించుకుంది ఈ సినిమా.

టాలీవుడ్ లో ఈ సినిమా గురించి వార్త ఏమిటంటే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయనున్నారు. పుష్ప సినిమాను విడుదల చేసి సక్సెస్ అయిన నిర్మాతలు ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్లుగానే మిగిలిన షూటింగ్ తెరకెక్కించాలని ఇప్పటికే దర్శకుడు పరశురామ్ సూచనలు కూడా చేశారట. అయితే తెలుగు వర్షన్ ఇతర భాషలలో డబ్ విడుదల చేస్తారా లేదంటే డైరెక్ట్ గా ఇతర భాషలలోనూ షూట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ అప్డేట్ మహేష్ అభిమానులను ఎంతో ఉత్సాహ పరుస్తుంది అని చెప్పొచు. మొన్నటిదాకా ఈ సినిమా ను తెలుగులోనే అనుకునారు. ఇప్పుడు పాన్ ఇండియా అంటే గొప్పే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: