సినిమాల జాతర.. ప్రేక్షకులకు పండగే పండగ..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్‌లో సాధారణంగా దసరా, సంక్రాంతికి, హాలిడే సీజన్‌ సమ్మర్‌కి భారీగా సినిమాలు విడుదలవుతుంటాయి.  అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే పెద్ద హీరోల మధ్య పోటీ రాబోతోంది. ఫిబ్రవరి 4న చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుదలవుతోంది.   కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవితో రామ్ చరణ్ కూడా నటించాడు. తండ్రీకొడుకులు ఇద్దరు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  

రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి 'క్రాక్'తో మాస్‌ హిట్‌ కొట్టాడు. ఈ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌ ఎక్కాడు రవితేజ. ఇక ఇదే జోష్‌తో రమేశ్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేశాడు. ఇప్పటికే వచ్చిన టీజర్స్‌తో 'ఖిలాడి'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ లీడ్‌ రోల్స్‌లో వస్తోన్న సినిమా '18 పేజెస్'. సుకుమార్‌ కథతో పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్‌ అవుతోంది. గీతా ఆర్ట్స్‌2లో నిర్మాణమైన ఈ సినిమా ఫిబ్రవరి 18న బరిలో దిగుతోంది.

ఇక అనిల్‌ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, వరుణ్‌ తేజ్ హీరోలుగా వస్తోన్న సినిమా 'ఎఫ్3'. ఫ్యామిలీ హిట్‌ 'ఎఫ్2' సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్‌ అవుతోంది. ఫిబ్రవరిని సినిమాల సీజన్‌గా మార్చుతోన్న ఈ హీరోలు బాక్సాఫీస్‌ కూడా ఇదే రేంజ్‌లో సందడి చేస్తే సమ్మర్‌కి సూపర్‌హిట్‌ స్టార్టింగ్‌ వస్తుందని చెప్పొచ్చు. పాండమిక్‌తో చాన్నాళ్లుగా స్లీపింగ్‌ మోడ్‌లో ఉన్న బాక్సాఫీస్‌కి మరింత ఎనర్జీ వచ్చే అవకాశముంది. సంక్రాంతి ఫీవర్‌ని కంటిన్యూ చేస్తూ పరిశ్రమకి బూస్టప్‌ ఇస్తుందని చెప్పొచ్చు. మరి ఈ హీరోలు ఏం చేస్తారో చూడాలి. బ్రవరిలో అన్ని సినిమాలు వచ్చేస్తుండటంతో సినీ లవర్స్ చాలా ఆనందగా ఫీల్ అవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: