త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్న పవన్ హీరోయిన్.. పెళ్లి కొడుకు ఎవరంటే..?

Anilkumar
కేరళ కుట్టి నిత్యా మీనన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఎంతో అద్భుతంగా నటించగల ఈ భామ కి సినిమా అవకాశాలు ఎక్కువగా రావు. వచ్చినా కూడా అవి చిన్నా, చితకా సినిమాలే. అందుకే ఇప్పుడు నిత్యామీనన్ మనసు పెళ్లి వైపు మళ్ళిందట. ఎలాగో తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. దీనికి తోడు తాజాగా ఆమే నిర్మాతగా కూడా మారింది. అయినా కూడా ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. అందుకే త్వరలో నిత్యామీనన్ పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.


అయితే మరోవైపు ఇప్పటికే నిత్యా మీనన్ కి పెళ్లయిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా నిత్యామీనన్ ప్రవర్తిస్తోంది. నిజానికి ఇటీవల ఓ యంగ్ హీరోతో నిత్యామీనన్ చాలా కాలం డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని నిత్య మీనన్ కూడా పలు సందర్భాల్లో ఇండైరెక్ట్ గా బయట పెట్టింది. కానీ ఆ యంగ్ హీరో ఇదివరకే పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు నిత్యమీనన్ కూడా పెళ్ళి  పై సీరియస్ గా ఫుల్ ఫోకస్ పెట్టిందట. నిజానికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగాలని నిత్యామీనన్ ముందు ప్లాన్ చేసుకుంది. కానీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు.


అందుకే కొన్నాళ్ల కిందే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట. ఈ క్రమంలోనే నిత్యా మీనన్ కి చెన్నైలోని ఓ వ్యాపార వేత్తతో పెళ్లి ఫిక్స్ అయిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకూ ఆగాల్సిందే.అన్నట్టు నిత్యామీనన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి భార్య పాత్రలో కనిపించనుంది నిత్యామీనన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: