ఏంటి ఈ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీనా..?

Divya
దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీల హావానే కొనసాగుతోందని చెప్పవచ్చు. అలనాటి స్టార్ హీరోలు సైతం ఎన్నో మల్టీస్టారర్ మూవీలో నటించడం మనం చూసే ఉంటాము. కానీ ప్రస్తుతం ఉన్న హీరోలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. కానీ మహేష్ బాబు , వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీతో ఒక ట్రెండ్ సెట్ చేయడం వల్ల, ఇక అప్పటి నుంచి వరుస సినిమాలన్నీ ఎక్కువగా మల్టీస్టారర్ గానే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ మూవీలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

రాబోయే రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలలో rrr, బంగార్రాజు, భీమ్లా నాయక్, ఆచార్య వంటి మూవీలు కూడా ఎక్కువగా మల్టీస్టారర్ గానే వస్తున్నాయి. అయితే ఇద్దరు బడా స్టార్ లు మాత్రం నటిస్తున్నది ఒక rrr మూవీలో అని మాత్రం చెప్పవచ్చు. ఇక అలాంటి హైప్ తర్వాత ఇప్పుడు మరొక సారి ఇద్దరు స్టార్ హీరోల కలయికలో ఒక మూవీ రాబోతోందన్నట్లు సమాచారం. అందుకు కొన్ని సంకేతాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. రామ్ చరణ్-మహేష్ బాబు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఉండనున్నట్లు సమాచారం.

అయితే ఇందుకోసం ఒక అగ్ర దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నారని వార్త బయటికి వచ్చింది. కానీ కథ విషయంలో మాత్రం అల్లుఅరవింద్ కాస్త నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ మురుగదాస్ కూడా ఒక మల్టీస్టారర్ స్టోరీని వినిపించాడట. అయితే ఈ కథ కూడా అలాగే ఉన్నదట. అయితే ఒక స్టార్ డైరెక్టర్ అల్లు అరవింద్ కి ఒక కథ వినిపించారట కదా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా నటించడానికి మహేష్ రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: