ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాటలివే?
* చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ నుండి విడుదలయిన "లాహేలాహే.. లాహే" పాట ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. విడుదలయిన కాసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ పాటను పాడిన వారు హారిక నారాయణ్- సాహితీ చాగంటి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.
* ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న "లవ్ స్టోరీ" చిత్రంలో "దాని కుడి భుజం మీద కడవ..." అంటూ సాగే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటను సింగర్ మంగ్లి పాడారు. ఇప్పటికీ ఇది యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది.
* వకీల్ సాబ్ మూవీ కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని "మగువా మగువా..." పాట ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ఈ పాటను సింగర్ సిద్దు శ్రీరామ్ ఆలపించారు. ఇదే సినిమాలో "కంటి పాప కంటి పాప" అనే మరో పాట కూడా మంచి ఆదరణ పొందింది. ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు.
* ఉప్పెన చిత్రంలోని "జలజలజల పాతం నువ్వు" పాట కూడా సూపర్ హిట్ ను అందుకుంది. ఈ పాటను జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ లు పాడారు.
* అర్థ శతాబ్దం మూవీ లో "ఏ కన్నులు చూడని చిత్రమే" ఈ పాటను పాడింది సిద్ శ్రీరామ్. ఇది కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టగలిగింది.
* ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ నుండి "చుక్కల చున్నికే" పాట అందరి మన్నలను పొంది హిట్ అందుకుంది. ఈ పాటకు సింగర్ చేతన్ భరద్వాజ్ స్వరాన్ని అందించారు.
ఇలా ఈ మధ్య విడుదలై ప్రేక్షకుల మన్ననను ఈ పాటలు అందుకున్నాయి.