స‌ర్కారు వారి పాట‌కు శేఖ‌ర్ మాస్టార్ స్టెప్పులు

N ANJANEYULU
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా తెర‌కెక్కుతొన్న చిత్రం స‌ర్కారువారిపాట‌. వ‌రుస విజ‌యాల త‌రువాత మ‌హేష్‌బాబు న‌టిస్తొన్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచెనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. అభిమానుల అంచెనాకు త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చిత్రాన్ని భారీగానే తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ లొకేష‌న్‌ల‌లో చిత్రీక‌రిస్తున్నారు చిత్ర‌బృందం. ఇందులో మ‌హేష్‌స‌ర‌స‌న కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న‌ది. వాస్త‌వానికి ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ పూర్త‌యి విడుద‌ల కావాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ది.తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ వేగాన్ని పెంచుతొంది.
ఇదిలా ఉండ‌గానే.. ఈ సినిమ‌మాలో ఒక పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్ల‌డించాడు. ఈ నేప‌థ్యంలోనే స్పెయిన్‌లో సినిమా షూటింగ్ సెట్‌లో మ‌హేష్‌తో దిగిన ఫోటోను పోస్టు చేశారు శేఖ‌ర్ మాస్ట‌ర్‌. మ‌రోక‌సారి మ‌హేష్‌బాబు సార్ సినిమా స‌ర్కార్ వారి పాట‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నాన‌ని వెల్ల‌డించాడు. దీనికి మ‌హేష్‌బాబు షూటింగ్ ఎప్పుడు ఓ మ‌ధారానుభూతిని ఇస్తుందని క్యాప్ష‌న్ చేర్చాడు.
అదేవిధంగా ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ కంపోజిష‌న్ పూర్త‌యింద‌ని పేర్కొన్నాడు. త‌మ‌న్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌క‌గా అభిమానుల‌ను వెల్ల‌డించాడు. అంతేకాదు..  మ‌హేష్‌బాబుతో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు త‌మ‌న్‌. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేసి 20022లో వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి చితృబృందం స‌న్నాహాలు చేస్తోంది. అయితే మ‌హేష్‌, కీర్తిసురేష్‌ల‌తో పాటు ప్ర‌ధాన‌తారాగ‌ణంపై కొన్ని స‌న్నివేశాల‌ను, సాంగ్‌ను పూర్తిచేశారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రానుంద‌ని టాక్ వినిపిస్తోంది.  థ‌మ‌న్ ట్విట్ట‌ర్‌లో  ట్యూన్ షేర్ చేశాడు. ఈ ట్యూన్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: