యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటున్న భీమ్లా నాయక్..!

Pulgam Srinivas
మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా  హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు జనాల నుండి మంచి స్పందన లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.  ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, రానా, డానియల్ శేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ ఇద్దరు హీరోల కు సంబంధించిన ప్రోమో లను చిత్రబృందం విడుదల చేసింది, వీటికి జనాలు నుండి మంచి స్పందన లభించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి ఇంటర్ వెల్ సీక్వెల్ సన్నివేశాల కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చిత్ర బృందం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 12 జనవరి 2022 లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. మొదటి సారి పవన్ కళ్యాణ్, రానా లు కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి బాక్సాఫీసు దగ్గర ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తారో తెలియాలంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: