బంగారు పతకం సాధించిన స్నిగ్ధ..!
ఏలూరు లోని ఈమె సి.ఆర్.రెడ్డి కళాశాలలో చదువుతున్నప్పుడు ఎంబీఏ పూర్తి అయిన తర్వాత బంగారు పతకాన్ని కూడా సాధించింది. ఆ తర్వాత హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో కొద్దిరోజుల పాటు హెచ్ఆర్ మేనేజర్ గా కూడా పనిచేస్తుంది. అయితే స్నిగ్ధ కు సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన ఉద్యోగం మానిపిపించేలా చేసింది. అలా మొదటిసారి అలా మొదలైంది సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇందులో పింకీ పాత్రలు నటించింది..ఈ సినిమాలో నిత్య మీనన్ అలాగే నాని లకు స్నేహితురాలిగా నటించి, అక్కడ ప్రేక్షకుల చేత మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ,రొటీన్ లవ్ స్టోరీ , దమ్ము, జత కలిసే, టైగర్, ఒక్కడినే, గుంటూరు టాకీస్, కల్యాణ వైభోగమే వంటి పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.. ఇకపోతే స్నిగ్ధ ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ కి సంగీత స్వరకల్పన కూడా చేస్తోంది.. ప్రముఖ సంగీత గాయకురాలుగా గుర్తింపు పొందిన స్నిగ్ధ ,తన పాటలతో యువతని బాగా ఆకట్టుకుంటుంది.. లేడీ కమెడియన్ గా సినిమాలు చేస్తూ, మరో పక్క సింగర్ గా రాణిస్తూ తన సినీ జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే స్నిగ్ధ సినీ కెరీర్ మరింత ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.