తేజ్ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని బాబు మోహన్ ఏమన్నారంటే..?

Divya
ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ రోడ్ యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే.. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆయన ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన , స్పోర్ట్స్ బైక్ నడుపుతూ వస్తున్న సమయంలో అనుకోకుండా బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడు.. ఇకపోతే అక్కడే ఉన్న కొంతమంది అంబులెన్స్ కు ఫోన్ చేయడం వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించి, కాలర్ నెక్ దగ్గర శస్త్రచికిత్స కూడా చేశారు..

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.. ఇక సాయి ధరంతేజ్ కు జరిగిన యాక్సిడెంట్ గురించి పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రమాదానికి చింతిస్తూ స్పందించడం జరుగుతోంది.. ఇక ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. పోతే సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ ను, వారి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఇటీవల బాబు మోహన్ కూడా పలు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యాడు..


ఇందుకు కారణం బాబు మోహన్ కుమారుడు కూడా తనకు ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ నడుపుతూ.. ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. ఇక అంతే కాదు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. ఇక సాయి ధరంతేజ్ తల్లిదండ్రుల బాధను కూడా అర్థం చేసుకోగలను అంటూ ఆయన తెలిపాడు.. అంతేకాదు ఎవరు కూడా సరదా కోసం మీ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరించారు.. ముఖ్యంగా మరణించిన వారు బానే పోతారు.. వారిని ఇష్టంగా ప్రేమించే వారు ఎప్పటికీ మర్చిపోలేక జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుంది..

ఇక అంతే కాదు ఒక తండ్రిగా ఒక కుమారుడిని కోల్పోయిన నాకు మాత్రమే ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది..ఇకపోతే తేజ్ హెల్మెట్  పెట్టుకొని చాలా మంచి పని చేసాడు.. ఇక ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ఆయన సూచించాడు. అందరూ జాగ్రత్తగా ప్రయాణించాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: