స్టేజ్ మీద తన లవర్ తో గొడవ పడిన యాదమ్మ రాజు.. అందరు షాక్?

praveen
ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన కమెడియన్స్ లో యాదమ్మ రాజు కూడా ఒకరు. ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ అనే కార్యక్రమానికి ఒక స్టూడెంట్ లాగా ఎంట్రీ ఇచ్చిన యాదమ్మ రాజు తనదైన యాస భాష తో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో ఈటీవీ నిర్వాహకులు ఏకంగా అతనికి కమెడియన్గా అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.  అందరితో పోల్చి చూస్తే యాదమ్మ రాజుకు ఒక ప్రత్యేకమైన కామెడీ స్టైల్ ఉంటుంది  ఇక ఇదే తెలుగు ప్రేక్షకులందరిలో ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు కారణం అయ్యింది.

 అయితే ఈ టీవీ లో ఎన్నో ఏళ్ల పాటు తనదైన స్టాండప్ కామెడీ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యాదమ్మ రాజు.. ఇక ఆ తర్వాత ఈటీవీ కి దూరం అయ్యారు. ప్రస్తుతం జీ తెలుగులో కమెడియన్గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు యాదమ్మ రాజు.  అయితే గతంలో యాదమ్మ రాజు ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాదమ్మ రాజు తన గర్ల్ ఫ్రెండ్ తో వీడియోలు చూస్తూ అప్పుడప్పుడు అలరిస్తూ ఉంటాడు .  అయితే ఇటీవలే ఏకంగా యాదమ్మ రాజు స్టేజ్ పైనే తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడ్డాడు..  జేబులోంచి ఫోన్ తీసి కింద కొట్టి షూ తో ఆ ఫోన్ తొక్కాడు. దీంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు.

 ఇటీవలే కృష్ణాష్టమి సందర్భంగా అలా బృందావనంలో అనే ఈవెంట్  ప్లాన్ చేసారు జీతెలుగు నిర్వాహకులు. ఇక ఇటీవలే దీనికి సంబంధించి మొదటి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచడానికి రెండవ ప్రోమో ని కూడా విడుదల చేశారు.  ఇక ఈ ప్రోమో లో భాగంగా యాదమ్మ రాజు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్కిట్ చేస్తూ ఉంటాడు.  ఈ క్రమంలోనే ఇక గర్ల్ ఫ్రెండ్ అతన్ని అనుమానిస్తున్నట్లు గా అందరి ముందు నిలదీస్తుంది. నీ ఫోన్ చూపించు.. నాకు తెలియకుండా ఎవరికి మెసేజ్ చేసావో చూద్దాం అంటూ అడుగుతుంది.  నేను చూపెట్టను నా మీద నమ్మకం లేదా అంటూ యాదమ్మ రాజు అడుగుతాడు. లేదు ఒకసారి ఫోన్ చూపెట్టు అని అడగడంతో కోపంతో ఏకంగా ఫోన్ నేలకేసి కొట్టి దానిని తొక్కుతూ ఉంటాడు యాదమ్మ రాజు.  దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: